ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇది కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. దీంతో రోజురోజుకు ఆడపిల్లల రక్షణ కాస్త ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది అభంశుభం తెలియని ఆడపిల్లలకు మాయ మాటలు చెబుతున్నా కామాంధులు లైంగికంగా లొంగదీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత శారీరక అవసరాలు తీర్చుకుని నడిరోడ్డు పై వదిలేస్తున్నారు.

 అయితే ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనపై ఇటీవలి కాలంలో కోర్టు సంచలన తీర్పు ఇస్తూ ఉన్నాయ్. ఇటీవల మరోసారి మధ్యప్రదేశ్ హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతితో శారీరక సంబంధం పెట్టుకోవడం అంటే అది అత్యాచారం కిందకే వస్తుందని ఒకవేళ సదరు బాలిక భార్య అయినా కూడా రేప్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ అయిన భార్య తో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడు అంటూ ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మధ్య ప్రదేశ్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుని గర్భవతిని చేశాడు ఆరోపణలపై మధ్యప్రదేశ్కు చెందిన అజయ్ యాదవ్ అనే వ్యక్తిపై అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు.


 ఈ క్రమంలోనే ఇతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇటీవలే బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడు దాఖలు చేసిన నాలుగు బెయిల్ పిటిషన్ లను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. ఇటీవల మరోసారి పిటిషన్ దాఖలు చేశాడు జాదవ్.  ఈ క్రమంలోనే యువతి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ యువతి తండ్రి సాక్షాన్ని పరిశీలించింది న్యాయస్థానం.. ఆయన చెప్పిన వివరాల ప్రకారం జాదవ్ భార్య గర్భవతి అయ్యే సమయానికి 17 సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే వయస్సు కలిగి ఉందని మైనర్ బాలికను గర్బవతిని చేసినందుకుగాను బెయిల్ నిరాకరిస్తున్నట్లు మళ్లీ పిటిషన్ను కొట్టివేసింది . అదే సమయంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతి తో శృంగారం రేప్ కేటగిరీలోకి వస్తుంది అంటూ సుప్రీం కోర్టు తెలిపింది అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయవాది తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: