మహిళల పై దాడులు జరుగుతున్నాయని ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభుత్వం, పోలీసులు కొత్త రూల్స్ ను అమలు లోకి తీసుకొస్తూ లైంగిక దాడులు జరగకుండా కాపాడుతున్నారు.. కానీ ఎక్కడో చోట పోలీసుల కళ్ళు కప్పి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కామంతో కొందరు దుర్మార్గులు వరుస దాడులు చెస్తున్నారు. వావి వరుసలు కూడా మార్చిపోయి రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటన లు దేశం లో ఈ మధ్య ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా మైనర్ల పై ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.


ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. ఆడుకుందామని పిలిచి చిన్నారి పై లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు మైనర్లు ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. వివరాల్లొకి వెళితే.. ఢిల్లీ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్‌ బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా, అక్కడే ఉంటున్న 12 ఏళ్ల బాలుడు ఆమెతో మాటలు కలిపి ఆడుకుందామని బాలికను ఎవరూ లేని ప్లేస్ కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఘటనా స్థలానికి మరో బాలుడు కూడా చేరుకున్నాడు. అనంతరం వార్దిదరు ఆ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.


ఆ తర్వాత అమ్మాయిని అక్కడే వదిలి వెళ్లారు. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపెస్తామని బెదిరించారు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తన కడుపు, ప్రైవేట్ భాగాలలో నొప్పి గురించి తన తల్లికి చెప్పింది. ఇక తల్లి బలవంతంగా అడగటం తో ఈ విషయాన్ని బయటకు చెప్పింది.తల్లి ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించారు.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుథున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: