చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని చూస్తుంటారు. ఇక శిశువుకు పెట్టే ఏ ఆహారంలోనూ ఉప్పు కలుపరాదు. ఆహారంలో ఉప్పు జోడించడం వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. పసితనం నుంచే ఉప్పు ఇవ్వడం ప్రారంభిస్తే భవిష్యత్తులో అధిక రక్త పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఉప్పు బిస్కెట్లు కూడ ఏడాది వయసుకు ముందు ఇవ్వకూడదు.