టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల హవా నడుస్తోంది.. కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేసి కోట్లల్లో లాభాలను పొందుతున్నారు దర్శకనిర్మాతలు.. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ లకు పెద్ద దెబ్బే వేసేలా కనిపిస్తోంది కరోనా మహమ్మారి.. ఒక పెద్ద సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయితేనే భారీ వసూళ్లు వస్తాయి. వందల కోట్ల బిజినెస్ కి న్యాయం జరగాలంటే… సీజన్ కూడా చాల ఇంపార్టెంట్. కానీ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ఇప్పుడు 'కేజిఎఫ్ 2' అయోమయంలో పడిపోయింది.ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది.కానీ రిలీజ్ డేట్ మిస్ అయిపోయింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ విషయంలో టీమ్ చాల కష్టపడింది.

అందర్నీ మ్యానేజ్ చేసుకుని ఎలాంటి పోటీ లేని రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుంది. కానీ కరోనా దెబ్బకు అంతా చిందరవందర అయిపోయింది. సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకున్న 'కేజిఎఫ్ 2'కి, ఇప్పుడు సమ్మర్ లాంటి మరో సీజన్ కనిపించడం లేదు. మరోపక్క ఈ సినిమాకి భారీ పెట్టుబఢి పెట్టారు. అంతకుమించి ఈ సినిమాని భారీగా అమ్ముతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ కి ముందే కేజిఎఫ్ 2 సినిమా కోసం ఎన్నడూ లేనిది తెలుగులో కూడా గట్టిగా పోటీ పడ్డాయి పలు సంస్థలు.కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా కేజిఎప్ 2కి మరో మంచి రిలీజ్ డేట్ దొరికేలా లేదు. దసరాకి తెలుగు భారీ సినిమాలే క్యూలో ఉన్నాయి. కాబట్టి, సోలో రిలీజ్ డేట్ అసాధ్యం.
 
మరి పోటీలో తెలుగు స్టార్ హీరోలతో పోటీ పడి రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ అసాధ్యం. కాబట్టి ఎటు చూసినా కెజిఎఫ్ 2కి అసలు కాలం కలిసి వచ్చేలా లేదు. ఏది ఏమైనా 2018లో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ అత్యంత ప్రజాదరణ పొందింది.అందుకే కెజిఎఫ్ 2కి అంతకు మించిన ఆదరణ ప్రేక్షకులలో నెలకొంది. పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: