తెలుగు క్రేజీ దర్శకుడు బుచ్చిబాబు సన, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన 'ఉప్పెన' మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్న ఈ దర్శకుడి సినిమా విడుదలై ఇప్పటికి ఏడు నెలలు పూర్తి అయిన్నప్పటికీ ఇంకా తన తదుపరి సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మామూలుగా అయితే ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించినట్లయితే వరుసబెట్టి క్రేజీ ఆఫర్లు వస్తూ ఉంటాయి. దర్శకులు కూడా ఆ జోష్ లోనే  సినిమాలకు కమిట్ అవుతూ దూసుకు పోతూ ఉంటారు. కానీ 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా బుచ్చిబాబు సన పరిస్థితి మాత్రం కాస్త దీనికి భిన్నంగా ఉంది. నిజానికి బుచ్చిబాబు సన 'ఉప్పెన' సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా ను తెరకెక్కించాలని అనుకున్నాడు.

ఆ విషయంలో ఎన్టీఆర్ నుంచి కూడా పాజిటివ్ గానే సిగ్నల్స్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అవ్వడం వల్ల బుచ్చిబాబు సన తో సినిమా చేయడం కుదరలేదు. దానితో ఈ దర్శకుడు వేరే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఈ నేపథ్యంలో తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే కలిసి ఇంకో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ వైష్ణవ్ తేజ్ కూడా బిజీగా ఉండడం వల్ల బుచ్చిబాబు సన  సినిమాకు డేట్స్ ఇవ్వడం కుదరకపోవడంతో ఈ సినిమా కూడా సెట్ కాలేదు అంటూ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇలా బుచ్చిబాబు  తన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని కూడా తన రెండవ సినిమా ఆలస్యం కావడానికి కారణం స్టార్ హీరోల డేట్ లా కోసం వేచి చూడడం అని అనేకమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: