టాలీవుడ్ చరిత్రలో మహానటి సినిమా ఏ రేంజ్ లో పేరు పొందిందో అందరికీ తెలిసిందే. మహానటి సినిమా కీర్తి సురేష్ కి నటిగా మంచి గుర్తింపు వచ్చింది అనే విషయం స్పష్టంగా తెలుసు. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు అనే మాట వాస్తవం. ప్రస్తుతం కీర్తి సురేష్ చేస్తున్న సినిమాలన్నీ కూడా అగ్రహీరోలతో అనే విషయం కూడా తెలిసిందే. అయితే కీర్తి సురేష్ విషయంలో కొంతమంది దర్శక నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు అని ఆమెను ఎలాగైనా సరే తమ సినిమాలో తీసుకునే విధంగా లేదా ఆమెతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయించాలి అని ప్లాన్ కూడా చేస్తున్నారని అంటున్నారు.

ప్రధానంగా అశ్వినీదత్ ఆమె విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఈ సినిమాకు దర్శకత్వం ఒక ప్రముఖ దర్శకుడు వహించే అవకాశం ఉందని అంటున్నారు. లేకపోతే సుధ కొంగర దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథలు కూడా సుధా కూడా సిద్ధం చేశారని వార్తలు కూడా టాలీవుడ్ వర్గాల్లో కనబడుతున్నాయి.

ఇది పక్కన పెడితే ఇప్పుడు అశ్వినీదత్ కీర్తి సురేష్ ని ఈ సినిమా కోసం పంపిస్తున్నారని దాదాపు ఏడాది పాటు ఈ సినిమా షూటింగ్ కోసం కీర్తి సురేష్ కష్టపడాల్సి ఉంటుందని ఈ సినిమా కోసం ఆమె లావు కూడా అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సినిమాకు దాదాపు 80 కోట్ల వరకు బడ్జెట్ పెట్టుకున్నారని అందులో హీరోయిన్ పారితోషకం దాదాపు 20 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రకటించే అవకాశాలు కూడా ఉండొచ్చనేది టాలీవుడ్ వర్గాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: