తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి మహేష్ బాబు వారసుడిగా రాణిస్తున్నారు. అలాగే ఆ కుటుంబానికి అల్లుడిగా వచ్చిన సుధీర్ బాబు కూడా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నారు. సుధీర్ బాబు ఎక్కడైనా తన మామ పేరుగాని, తన బామ్మర్ది పేరు గాని వాడకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు సుధీర్ ఇండస్ట్రీకి రాకముందు బాడ్మింటన్ ప్లేయర్ గా రాణించారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమకథా చిత్రం సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా సుధీర్ బాబు నటించిన సినిమాఅమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రం  ప్రమోషన్‌లో భాగంగా సినిమా గురించి దాని నేపథ్యం గురించి దర్శకుడు సుధీర్‌బాబు చెప్పుకొచ్చారు.

అయితే ముందు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కంటే ఆ దర్శకుడు గురించి చెప్పాలంటూ.. చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గురించి సుధీర్ బాబు వెల్లడించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో వరసబెట్టి సినిమాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. నా ఫేవరేట్ దర్శకుడు ఆయన అని వెల్లడించారు. ఇక నేను ఏ హీరోయిన్‌తో మూడు సినిమాలు చేయలేదు.. కానీ ఆయనతో మూడు సినిమాలు చేశాను అని అన్నారు.

అంతేకాదు.. సుధీర్ బాబు ఏ హీరోయిన్‌తో కూడా కంపేర్ చేస్తే ఆయనతో వుంటే కెమిస్ట్రీ ఎక్కువని ఫీల్ అవుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఇది రొమాంటిక్ డ్రామా. నేను ఇంతకుముందు సమ్మోహనంలో సినిమాలు ద్వేషించే వ్యక్తిగా నటించాను.. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి విరుద్ధం అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో సినిమాలు అంటే తపన వుండే దర్శకుడి పాత్ర పోషించాను అని అన్నారు. అయితే ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: