తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. చీకటి సమయంలో దేశ రక్షకులు గా మారిన ఒక వ్యక్తి కథ అంశంగా ఈ సినిమాని తెరకెక్కించడం చాలా గర్వకారణంగా ఉందని మహేష్ బాబు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ మొదట్లోనే అడవి శేషు ఒక అద్భుతమైన డైలాగ్ ఎంట్రీ ఇస్తారు. ఇక ఇందులో ప్రకాష్ రాజ్ కూడ మరొకసారి తన అద్భుతమైన నటన కనబరిచారు అని చెప్పవచ్చు.
సందీప్ తన బాల్యం నుంచే సైన్యంలోకి చేరాలని ఒక లక్ష్యంతో..NSG కమాండర్ గా మారి సేవలు అందిస్తూ వుంటారు. ఇలాంటి సమయంలో ముంబై టెర్రర్ అధ్యక్షులు దేశం కోసం ప్రాణాలు అర్పించే సంఘటనలు ఈ చిత్రంలో చాలా అద్భుతంగా చూపించారట. ఇక అంతే కాకుండా ఈ సోల్జర్ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను మేజర్ సినిమా ద్వారా చూపించడం జరిగింది. ఇక అడవి శేషు తల్లిగా రేవతి అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ఇక ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. ఇక ఇందులో మురళి శర్మ, శోభితా ధూళిపాళ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.