రాజా వారు రాణి గారు మూవీ తో వెండివతెరకు పరిచయమై , ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి కమర్షియల్ హిట్ ను అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస పెట్టి మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మాన్స్ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సమ్మతమే , నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే రెండు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమా లలో సమ్మతమే సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతోంది.

మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన చాందినీ చౌదరి చౌదరి కథానాయికగా నటించింది. సమ్మతమైన సినిమా నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. నేను మీకు బాగా కావాల్సిన వాడినే సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇలా రెండు మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్నా కిరణ్ అబ్బవరం ఈ మూవీ లతో పాటు రూల్స్‌ రంజన్‌ అనే మూవీ లో కూడా హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ కి రతినం కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.

ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీ కృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన డీజే టిల్లు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను కొట్టేసిన నేహా శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది. ఈ మూవీ లో టాలీవుడ్ , బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: