టాలీవుడ్ లో మన్మధుడుగా అక్కినేని నాగార్జున పేరు పొందారు ఇక మహేష్ బాబు కూడా అందగాడుగా పేరు పొందాడనే విషయం అందరికీ తెలిసిందే..వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్లర్ మూవీ రాబోతుందా అన్నట్లుగా నిన్నటి రోజు నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే నాగార్జున హీరోగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమా ట్రైలర్ ని నిన్నటి రోజున ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పెద్ద హిట్ కావాలంటే చిత్ర బృందం నికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మహేష్ బాబు. ఇక అందుకు ప్రతిస్పందనగా మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాగార్జున ఒక ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగింది.


నాగార్జున ఇలా రాసుకొస్తు.. హే.. మహేష్..29 ఏల క్రితం వారసుడు సినిమాతో నాతో కలిసి మీ నాన్న కృష్ణ కలసి నటించినప్పుడు చాలా సంతోషించాను మనం కలిసి ఎందుకు సినిమా చేయకూడదంటూ మహేష్ బాబును అడిగినట్లు సమాచారం .. ఈ ట్విట్ పై మహేష్ కూడా స్పందిస్తూ.. అది ఆసక్తిగా ఎదురు చూడాల్సిన విషయం అంటూ మల్టీ స్టార్ నటించేందుకు తనకి కూడా ఇష్టమే అన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. ఇక వీరిద్దరూ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక వీరి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామంటూ ఇతర అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరూ ఇప్పటికే పలు మల్టీ స్టార్ సినిమాలలో కూడా నటించారు వెంకటేష్ తో కలిసి మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించగా.. ఇక నాగార్జున కూడా నేచురల్ స్టార్ నానితో కలిసి దేవదాసు చిత్రంలో నటించారు. మరి మహేష్ బాబు నాగార్జున కనిపిస్తే ఎలా ఉంటుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: