'సీతా రామం' సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ నటనకు దేశావ్యాప్తంగా కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సీతా మహాలక్ష్మిగా ఆమె నటనకు కుర్రకారు అయితే తెగ ఫిదా అయిపోయారు. అయితే నిజానికి ఈ సినిమా కోసం ఆమె మరో పెద్ద సినిమాను మిస్ అయ్యిందట.అది కూడా అలాంటి ఇలాంటి సినిమా కాదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ లాంటి అగ్ర హీరో సరసన నటించే అవకాశం. అవును, ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. ఆ సినిమా నిర్మాత అశ్వనీదత్. అయితే ఆ సినిమా అవకాశం కోల్పోయినా.. ఈ సినిమాతో ఆమె మంచి పేరే తెచ్చుకుంది.ప్రభాస్ - నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్‌ 'ప్రాజెక్ట్‌ కె' (వర్కింగ్‌ టైటిల్‌) అనే పాన్ వరల్డ్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఈ పాత్ర కోసం మృణాల్‌ ఠాకూర్‌ను అనుకున్నారట. ఆమెను సినిమా కోసం అంతా ఓకే చేసుకున్నాక.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వద్దకు 'సీతా రామం' స్క్రిప్ట్‌ వచ్చిందట. ఆ కథ గురించి తెలుసుకున్నాక.. ఆ కథలో సీతా మహాలక్ష్మి పాత్రకు మృణాల్‌ అయితే బాగుంటుందని అనుకున్నారట.


అలా 'సీతారామం' సినిమాలోకి మృణాల్‌ ఠాకూర్‌ వచ్చిందని నిర్మాత అశ్వనీద్‌ తెలిపారు.అలా 'సీతా రామం' సినిమాలో వచ్చిన అవకాశాన్ని మృణాల్‌ ఠాకూర్‌ బాగా ఉపయోగించుకుంది అని చెప్పాలి. సీతా మహాలక్ష్మి పాత్రలో ఆమె నటన, ఆహార్యం, అందం అదిరిపోయాయి. ఒకవేళ ప్రభాస్‌ సరసన చేసి ఉంటే.. ఇంత పేరు వచ్చి ఉండేదా? అంటే చెప్పలేం. కానీ ఇప్పుడు సీత పాత్రతో ఆమెకు వచ్చిన పేరుతో వరుస అవకాశాలు అందుకుంటోంది అని చెప్పొచ్చు. ఇప్పుడు కుర్ర స్టార్‌ హీరోలు తమ కొత్త సినిమాల్లో ఈ భామను ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు.అయితే ఈ క్రమంలో మృణాల్‌ రెమ్యూనరేషన్‌, ఇతర ఖర్చులు కాస్త ఘాటెక్కాయని చెబుతున్నారు. అయితే గ్లామర్‌ పరంగా, నటన పరంగా బాగుండటంతో నిర్మాతలు కూడా వెనకడుగు వేయలేకపోతున్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఆమె నుండి కొత్త తెలుగు సినిమా అనేది ఇంకా అనౌన్స్‌ కాలేదు.కానీ త్వరలోనే ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్సులు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: