రెండురోజులలో చైతు సమంతల వార్ క్లైమాక్స్ కు రావడంతో ‘శైలజా రెడ్డి’ ‘యూటర్న్’ మూవీలలో ఏసినిమా చివరకు విజేతగా మారుతుంది అన్న ఆతృత అభిమానులలలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలలో కూడ విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థుతులలో నాగచైతన్య రంగంలోకి దిగి స్వయంగా సమంత సినిమాను చూడవద్దు అంటూ తన అభిమానులకు ఇచ్చిన సందేశం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

"దయచేసి అంతా నా సినిమానే చూడండి ప్లీజ్. ఎందుకంటే ఈ ఏడాది నాకిది ఫస్ట్ రిలీజ్. సమంతకు సంబంధించి ఆల్రెడీ ఈ ఏడాది ‘రంగస్థలం’ ‘మహానటి’ ఉన్నాయి. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి నా సినిమానే ముందు చూడండి" అంటూ నాగచైతన్య ఇచ్చిన పిలుపు చైతు సమంతల అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు చైతు మరో ట్విస్ట్ ఇస్తూ సమంత తన ‘శైలజా రెడ్డి’ ని చూడటమే కాకుండా ఈమూవీని బాగా మెచ్చుకుంది అన్న లీకులు కూడ ఇస్తున్నాడు చైతన్య.
Naga Chaitanya,Shailaja Reddy Alludu,Ramya Krishnan
అయితే వెంటనే సమంతకు కోపం రాకుండా మరో ట్విస్ట్ తీసుకున్నాడు చైతన్య. తాను కూడ ‘యూటర్న్’ సినిమాను చూశానని ఆమూవీ కూడ చాలబాగుంది అని చెపుతూ తమ రెండు సినిమాలకు చివరి 40 నిమిషాలు చాల కీలకం అని చెపుతూ ఈరెండు సినిమాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు అంటూ మరో షాక్ ఇచ్చాడు చైతన్య. 
దీనినిబట్టి చూస్తుంటే ఈవినాయక చవితి వార్ లో తన సినిమాతో పాటు సమంత సినిమా కూడ బాగా సక్సస్ అవ్వాలని చైతన్య గట్టిగా కోరుకుంటున్నట్లు అభిప్రాయం కలుగుతోంది.
‘యు ట‌ర్న్’ సెన్సార్ టాక్
అయితే బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పటికే ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ బిజినెస్ 25 కోట్ల స్థాయికి చేరిపోతే సమంత ‘యూటర్న్’ కేవలం 6 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది అన్నవార్తలు వస్తున్నాయి. అయితే ఒక్కసారి సమంత సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అది వైరల్ గా మారుతుంది కాబట్టి భయంతో చైతన్య వ్యూహాత్మకంగా సమంత సినిమా కన్నా ముందుగా తన సినిమానే చూడమని పిలుపు ఇచ్చాడు అనుకోవాలి..     


మరింత సమాచారం తెలుసుకోండి: