ఇటీవల తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారం అయిన క్రేజీ షో బిగ్ బాస్ పై మొదట్లో కొన్ని అనుమానాలు రేకెత్తినప్పటికీ, వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ, ఈ షో మెల్లగా ప్రేక్షకాదరణ చూరగొని మంచి రేటింగ్స్ తో ముందుకు సాగింది. మొదటి రెండు సీజన్స్ కూడా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయం సాధించగా, ఇటీవల ప్రారంభమైన మూడవ సీజన్ కూడా ఎంతో ఆసక్తిగా సాగి, నిన్నటితో సక్సెస్ఫుల్ గా ముగిసింది.  కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో ఫైనల్ విజేతగా సింగర్ రాహుల్ సిప్లి గంజ్ నిలవగా, రన్నరప్ గా యాంకర్ శ్రీముఖి నిలిచింది. ఇక నిన్న ఎంతో రసవత్తరంగా, 

మరియు వైభవోపేతంగా జరిగిన ఫైనల్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు విచ్చేసి, షో కి మరింతగా కళ తీసుకువచ్చారు. మొదటి నుండి శ్రీముఖి మరియు రాహుల్ ల మధ్య గట్టి పోటీ జరుగుతోందని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు రావడం జరిగింది. అయితే వాటన్నిటినీ నిజం చేస్తూ, చివరి రౌండ్లో వారిద్దరూ నిలవడం, మరియు ఫైనల్ విన్నర్ గా రాహుల్ ఎంపిక కావడంతో, అతడి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక షో ముగిసిన తరువాత అభిమానుల కోసం తన కారులో చక్కర్లు కొట్టి వారికి కృతజ్ఞతలు తెలిపిన రాహుల్, అందరూ అభినందించేలా ఒక అద్భుతమైన పని చేసినట్లు సమాచారం. 

అదేమిటంటే, తాను బిగ్ బాస్ షోలో గెలుచుకున్న ప్రైజ్ మనిలో కొంత డబ్బు చారిటి సేవలకు వినియోగించాలని రాహుల్ నిర్ణయించారని, ఈ మేరకు అతడి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఆ మంచి నిర్ణయానికి పూర్తిగా మద్దతు తెలిపారని అంటున్నారు. అయితే ప్రస్తుతం అతడి సన్నిహితుల ద్వారా బయటకు వచ్చిన ఈ వార్త, మరికొద్దిరోజుల్లో అధికారికంగా వెల్లడి కానున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వార్త కనుక నిజమే అయితే రాహుల్ కు మరింత మంచి పేరు రావడం ఖాయం అనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: