టాలీవుడ్ డార్లింగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి రెండు భాగాల అత్యద్భుత విజయాల తర్వాత అమాంతం మన భారత దేశంలోనే ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ని మరియు కెరీర్ పరంగా తన మార్కెట్ స్థాయిని మరింతగా పెంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇటీవల అత్యంత భారీ ఖర్చుతో మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన సాహో సినిమా మాత్రం, ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే టాలీవుడ్ లో పెద్దగా ఆకట్టుకోని ఆ సినిమా, అటు నార్త్ లో మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువగానే కలెక్షన్స్ రాబట్టింది. 

దానితో ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ వాల్యూ మరొకసారి నిరూపితమైంది. అయితే బాహుబలి సినిమాల తర్వాత తనకు మంచి అవకాశం దొరికితే ఒక బాలీవుడ్ సినిమాలో నటిద్దామని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్ కు, ప్రస్తుతం అవకాశం అవకాశం వచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన కరణ్ జోహార్ ప్రభాస్ కోసం ఒక అత్యద్భుతమైన కథను సిద్ధం చేశారని, ఆ కథ తప్పకుండా ప్రభాస్ కు నచ్చుతుందని ఆయన భావిస్తున్నారట. అలానే ప్రభాస్ కూడా కరణ్ గారి కోరిక మేరకు ఆ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో పాటు, హీరోగా ప్రభాస్ రేంజ్ ని పెంచేలా ఈ సినిమా ఉంటుందని టాక్.

అంతేకాక ఈ విషయమై ప్రభాస్ సన్నిహితులు కొందరు కూడా నిజమేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడితేనే కానీ పూర్తి నిజానిజాలు బయటికి రావని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం, మన బాహుబలి ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద పండుగ వార్త అని చెప్పాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: