‘సాహో’ విడుదల అయ్యేంత వరకు సుజిత్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ అతడు రాజమౌళి స్థాయిని అందుకోగల దర్శకుడు అంటూ ఇండస్ట్రీలో అనేకమంది సుజిత్ పై ప్రశంసలు కురిపించారు. అనేకమంది టాప్ హీరోలు కూడ ‘సాహో’ విడుదలకు ముంది సుజిత్ తో సినిమాలు చేయడానికి తమ ఆశక్తిని ప్రదర్శించారు.

అయితే సుజిత్ మాత్రం తనను విపరీతంగా పొగడవద్దు అంటూ ఓపెన్ గా అభ్యర్ధనలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. అయితే ‘సాహో’ ఫెయిల్యూర్ తరువాత సుజిత్ పేరును కనీసం పెద్దగా అవకాశాలు లేని హీరోలు కూడ స్మరించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో శర్వానంద్ సుజిత్ కు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకో బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సుజిత్ మొట్టమొదటి సినిమా ‘రన్ రాజా రన్’ శర్వానంద్ తో తీయడంతో అప్పటి నుండి సుజిత్ కు శర్వానంద్ పట్ల మంచి అభిమానంతో పాటు గౌరవం కూడ ఉంది అని అంటారు. ‘సాహో’ విడుదలకు ముందు సుజిత్ ఒక సందర్భంలో శర్వానంద్ ను కలిసి ‘సాహో’ విడుదల తరువాత తనతో ఒక సినిమాను చేయమని కోరినట్లు టాక్. సుజిత్ కోరికకు షాక్ అయిన శర్వానంద్ ‘సాహో’ తరువాత టాప్ హీరోతో సినిమాను చేయకుండా తనను ఎందుకు ఎంచుకుంటున్నావు అని అడిగినప్పుడు తనకు సెంటిమెంట్ గా తన మూడవ సినిమా శర్వానంద్ తో చేయాలి అన్న కోరిక ఉన్నదని చెప్పినట్లు సమాచారం. 

అయితే ఆ తరువాత ‘సాహో’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో షాక్ లోకి వెళ్ళిపోయిన సుజిత్ ఈమధ్య శర్వానంద్ ను కలిసి అతడు తనకు ఇచ్చిన మాటను గుర్తుకు చేసినప్పుడు మంచి కథతో తన వద్దకు రమ్మని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న '96' రీమేక్ 'శ్రీకారం' సినిమాలు షూటింగ్ విషయంలో చివరి దశలో ఉండటంతో నిజంగానే శర్వానంద్ సుజిత్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా లేదంటే సుజిత్ ని హర్ట్ చేయడం ఇష్టంలేక ఇలా చెప్పాడా అంటూ కొందరు సందేహాలు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: