ఈటివి ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దాదాపుగా ఏడేళ్లుగా ఆ షో ఎంతో మంచి ప్రేక్షకాధరణతో పాటు ఇప్పటికీ కూడా అద్భుతమైన రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. అయితే ఆ షోపై మొదట్లో కొందరు పెదవి విరిచినప్పటికీ, మెల్లగా రాను రాను ఆ షో ప్రేక్షకులకు చేరువ అవడం, అలానే ఒక్కొక్కరుగా మంచి టాలెంట్ ఉన్న పార్టిసిపెంట్స్ షోలో ప్రవేశిస్తూ తమ ఆకట్టుకునే కామెడీ టాలెంట్ తో షోని మరింత సక్సెస్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు అనే చెప్పాలి. 

 

ఇక ఈ షోకు జడ్జీలుగా మెగా బ్రదర్ నాగబాబు మరియు రోజా ఎప్పటినుండో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా నాగబాబు ఈ షో నుండి నిష్క్రమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసారు. షో నిర్వాహకులైన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోని కొందరు నిర్వాహక సభ్యుల ప్రవర్తన నచ్చకపోవడం వల్లనే జబర్దస్త్ నుండి తాను బయటకు వచ్చేసినట్లు నేడు ఆయన తన యూట్యూబ్ ఛానల్ వేదికగా కామెంట్స్ చేసారు. ఇకపోతే ఈ షో నుండి నాగబాబుతో పాటు అనసూయ, చమ్మక్ చంద్ర కూడా బయటకు వచ్చారు. కాగా వారితో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, 

 

గెటప్ శ్రీను కూడా బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో రోజా మధ్యవర్తిగా వ్యవహరించి వారికి బ్రెయిన్ వాష్ చేసినట్లు సమాచారం. కాగా వారిలో సుడిగాలి సుధీర్ మాత్రం, తనకు లైఫ్ ని ఇచ్చిన జబర్దస్త్ ను వీడి బయటకు రాలేనని చెప్పినట్లు టాక్. అంతేకాక తనకు కెరీర్ తొలి నాళ్ల నుండి ఇప్పటివరకు కూడా రోజా గారు ఎంతో మేలు చేసారని, ఎమ్యెల్యే గా నాకు వ్యక్తిగతంగా ఆవిడ చేసిన సాయం ఎప్పటికి మరిచిపోలేనని, అందువల్లనే ఆవిడ మాట ప్రకారమే షో నుండి బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: