ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ... తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని... అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం సినీ ప్రేక్షకుల లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది నయనతార. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పదేళ్లు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ ఈ అమ్మడు  క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. దర్శక నిర్మాతలు ఈ అమ్మడి డేట్స్ కోసం క్యూ కడుతూనే ఉన్నారు.యువ  హీరోయిన్లు కూడా ఈ అమ్మడు ముందు సాటి రారు అనే చెప్పాలి. ముఖ్యంగా సీనియర్ హీరోల అందరికీ ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే లక్ష్మి సినిమాతో వెంకటేష్ సరసన నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నయనతార ఆ తర్వాత వరుస  అవకాశాలను అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదిగింది. మరోవైపు తమిళ భాషల్లో కూడా నటిస్తోంది. 

 

 

 మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది నయనతార. ఇప్పటికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో నయనతార కు ఒక ప్రత్యేకమైనా ఇమేజ్  ఉంది. ఎంతో మంది కొత్త కథానాయకులు వస్తున్నప్పటికీ కూడా నయనతార ఇమేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే గతంలో దర్శకుడు బాపు తెరకెక్కించిన శ్రీరామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన సీత పాత్రలో నటించిన నయనతార.. సీతాదేవిని మైమరిపించేలా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ట్రెడిషనల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది నయనతార.

 

 

 అయితే తాజాగా ఈ అమ్మడు తమిళ సినిమా మూకుత్తి అమ్మన్  సినిమాలో... అమ్మవారి గెటప్లో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో నయనతార ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి రూపంలో కనిపించి ఆకట్టుకుంది. ఆర్.జె బాలాజీ, ఎన్జే  శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు  తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నయనతార ఫస్ట్ లుక్  మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు విభిన్న పాత్రల్లో నటించిన నయనతార అమ్మవారి పాత్రలో మాత్రం ఇప్పటివరకు నటించలేదు. దీంతో  మొదటి సారి నయనతార అమ్మ వారి పాత్రల్లో నటిస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: