ఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలు తమ సినిమాల కోసం కేవలం హీరో హీరోయిన్లను సెలెక్ట్ చేయడం లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవడం లేదు. హీరో హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటించే నటులు కూడా తీసుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా నేటి తరం హీరో హీరోయిన్లకు నాటి తరం హీరోయిన్లు తల్లి అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. అయితే ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తల్లి పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇలా ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన హవా  నడిపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా నేటి తరంలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో ఒకరు నదియా. 

 


 ఒకప్పుడు నదియా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అందం అభినయంతో ఎంతోమంది ఆకట్టుకున్నది. హీరోయిన్  గా  ఎంతగానో గుర్తింపు సంపాదించింది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ నదియాను అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించిన చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా నదియా రీ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇంతలోనే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమా విడుదలైంది. ఈ సినిమాలు ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించిన నదియాకు మంచి బ్రేక్ వచ్చింది . అ ఆ తర్వాత వచ్చిన ఆ సినిమాలో కూడా సమంత తల్లి పాత్రలో నటించింది  నదియా. ఇలా నేటి తరం హీరోయిన్లు అందరికీ తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నదియా. 

 


 ప్రస్తుతం దర్శక నిర్మాతలందరూ కూడా తమ తమ సినిమాల్లో  హీరోయిన్ లేదా హీరో తల్లి పాత్ర కోసం నదియాను తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ తన సినిమాలలో నదియాని తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ కు సంబంధించిన రెండు మూడు సినిమాలు నదియా హీరోయిన్ లకు  తల్లి పాత్రలో నటించింది. హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో కొత్త నటీమణులను తీసుకొచ్చేందుకు త్రివిక్రం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: