ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... టాలీవుడ్ హీరో రవితేజ తన సినిమాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఆయనకి సరైన హిట్టు సినిమా పడలేదు. గత కొంత కాలంగా వరుసగా భారీ పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా పిలవబడే రవితేజకు ఈమధ్య అన్ని ప్లాపులే. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘డిస్కో రాజా’ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో డీలా పడ్డాడు ఈ హీరో. ప్రస్తుతం రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.
ఈ క్రమంలో తాజాగా ‘ఖిలాడీ’ అనే మరో సినిమా అనౌన్స్ చేశాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీనికి ‘ప్లే స్మార్ట్’ అనే ట్యాగ్ లైన్ జోడించారు. అంటే ఇందులో మాస్ హీరో స్మార్ట్ గా కనిపంచబోతున్నాడన్నమాట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడట. ఇప్పటివరకు తన పాత్రల్లో వేరియేషన్స్ చూపించిన రవితేజ చాలా రోజులకి డ్యూయల్ రోల్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు..

తమిళంలో హిట్ అయిన ఓ సినిమా స్ఫూర్తితో ‘ఖిలాడీ’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.ఇక మాస్ మహారాజ్  రవి తేజ ఎంతో ఇష్టం తో చేస్తున్న  ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని న్యూస్ ల కోసం చదువుతూ ఉండండి ఇండియా హెరాల్డ్ ఆర్టికల్స్.. అలాగే ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: