ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. టాలీవుడ్లో  మంచు మనోజ్ సరసన  ‘ప్రయాణం’ సినిమాలో  హీరోయిన్ గా పరిచయమైంది  నటి పాయల్ ఘోష్.  ఆ తరువాత  యంగ్ టైగర్ ఎన్టీఆర్ "ఊసరవెల్లి'  సినిమాలో ఒక ముఖ్య పాత్రలో  నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో పాయల్ కి ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛ, స్త్రీ-పురుష సమానత్వం మీద  పెద్ద పోస్ట్ పెట్టి వివాదంగా నిలిచింది. 




అసలు విషయంలోకి వస్తే..  రీసెంట్ గా ఈ ముద్దు గుమ్మా  వీకెండ్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో మందు గ్లాసులో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు. సెలబ్రిటీ అయి ఉండి ఇలాంటి పోస్ట్ లు పెట్టడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఇష్టమొచ్చినట్లు ఆమెపై కామెంట్స్ చేశారు. అయినప్పటికీ పాయల్ తగ్గలేదు.


మందు కొడుతూ మరో ఫోటోని పోస్ట్ చేస్తూ అందరికీ క్లాస్ తీసుకుంది. తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా గడిపే హక్కు తనకుందని చెప్పింది. తను కూడా మందు కొట్టొచ్చని, సిగరెట్ తాగొచ్చని, కురచ దుస్తులు వేసుకోవచ్చని చెప్పింది. ఈ విషయాల్లో తనకు అడ్డుచెప్పే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. స్త్రీ-పురుషులు సమానం అని చెప్పడమే తప్ప.. ఎక్కడా అది జరగడం లేదని.. సమానత్వం సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది.ఇక    మరెన్నో   విషయాలు కోసం  ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: