టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చేసి మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. జయ జానకి నాయక, సాక్ష్యం, రాక్షసుడు, కవచం వంటి సినిమాలతో హీరోగా సెటిలై ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గా సినిమాల్లోకి అడుగు పెట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకొని బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన డబ్బింగ్ సినిమాలతో అలరించాడు.

ఈ నేపథ్యంలో తనకు హిందీ లో వస్తున్న ఆదరణను చూసి హిందీలో డైరెక్ట్ సినిమా చేస్తే బాగుంటుందని నమ్మి తనను టాలీవుడ్ కి పరిచయం చేసిన వి వి వినాయక్ దర్శకత్వంలో చత్రపతి సినిమాను రీమేక్ బాలీవుడ్ లో చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చత్రపతి సినిమా టాలీవుడ్ లో సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అయితే బాలీవుడ్ లో తనకు హీరోగా మంచి ఎలివేషన్ వచ్చేలా ఉంటుందని అక్కడ నిలదొక్కుకోవడానికి ఇదే సరైన సినిమా అని బెల్లంకొండ శ్రీనివాస్ నమ్మాడు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో కూడా మొదలు పెట్టాడు.

దానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టడం విశేషం. ఇకపోతే ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు అప్పుడే బాలీవుడ్ లో మరో తెలుగు సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో బెల్లంకొండ ఉన్నాడట. వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా ను అక్కడ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో బెల్లంకొండ ఉన్నాడట. ఈ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నాన్న బెల్లంకొండ సురేష్ నిర్మించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ గురించి కూడా త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఒక్క సినిమాతోనే బెల్లంకొండ లో కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: