దానికి దర్శకధీరుడు
రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టడం విశేషం. ఇకపోతే ఈ
సినిమా ఇంకా మొదలు కాలేదు అప్పుడే
బాలీవుడ్ లో మరో తెలుగు సినిమాను
రీమేక్ చేయాలనే ఆలోచనలో బెల్లంకొండ ఉన్నాడట. వినాయక్ దర్శకత్వంలో
ఎన్టీఆర్ నటించిన
ఆది సినిమా ను అక్కడ
రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో బెల్లంకొండ ఉన్నాడట. ఈ సినిమాను
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నాన్న
బెల్లంకొండ సురేష్ నిర్మించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ గురించి కూడా త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఒక్క సినిమాతోనే బెల్లంకొండ లో కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయింది అని చెప్పవచ్చు.