జాతి రత్నాలు వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనుదీప్. రెండో సినిమాతోనే ఈ రేంజ్ లో సూపర్ హిట్ అందుకోవడం ఒక అనుదీప్ కి దక్కింది అని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తొలి
సినిమా గా పిట్టగోడ చేసినా
సక్సెస్ చూడలేకపోయాడు ఈ డైరెక్టర్. కానీ రెండో
సినిమా జాతి రత్నాలు గా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఈ
సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోని క్రేజీ
డైరెక్టర్ లో ఒకరిగా కలిసిపోయడు అనుదీప్.
టాలీవుడ్ లో చాలా మంది హీరోలు అతనితో
సినిమా చేయాలని ఆశపడగా తాను మాత్రం
తమిళ్ హీరో శివ కార్తికేయన్ తో
సినిమా చేయడానికి ఫిక్సయిపోయాడు. అయితే దానికి కారణం లేకపోలేదని ఓ పాన్
ఇండియా సినిమా చేయాలనే ఉద్దేశంతో
తమిళ హీరో కు వెళ్లడానికి తెలుస్తుంది. తెలుగులో
మాస్ రాజా
రవితేజ లాగా మొదటినుంచి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి స్టార్
హీరో అయ్యాడు
శివ కార్తికేయన్. వరుసగా తొమ్మిది ఇట్లు అంటే మామూలు విషయం కాదు. అలా 9 విజయాలు అందుకుని తమిళంలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన చేరిపోయాడు.
తమిళంలో స్టార్ హీరోలైన విజయ్,ధనుష్ లాంటి వాళ్లు తెలుగు
డైరెక్టర్ లతో మల్టీ లాంగ్వేజ్ సినిమాలు చేస్తుండగా శివకార్తికేయన్ కూడా వారిలాగానే సినిమాలు చేస్తానని ఆ జాబితాలో చేరిపోయాడు. అందుకే అనుదీప్ చెప్పిన కథను ఓకే చేసి ఆయనతో
సినిమా ఒప్పుకున్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
ధనుష్ నటిస్తున్న సినిమానీ ఎసియన్ మూవీస్ వారు నిర్మిస్తుండగా ఈ సినిమాను కూడా వారే నిర్మించబోతున్నారు అని తెలుస్తుంది.పాన్
మసాలా అనే టైటిల్ ను పెట్టబోతున్నారట అనుదీప్. మరి అను దీప్ పాన్
ఇండియా సినిమా కల నెరవేరుతుందా చూడాలి.