పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలు కూడా పెంచేశాయి.

ఇలా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న భీమ్లా నాయక్ సినిమా ను సంక్రాంతి కానుక గా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటం తో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచేసింది. అందులో భాగంగా తాజా గా భీమ్లా నాయక్ చిత్ర బృందం అడవి తల్లి మాట ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి పాడారు. అలాగే ఈ పాటకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రజల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తూ రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ పాట కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సాంగ్  కూడా యూట్యూబ్ లో అదిరిపోయే రికార్డులను సృష్టిస్తోంది అని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దగ్గుబాటి రానా అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: