‘అఖండ’ ఘన విజయంతో కరోనా ఒమైక్రాన్ భయాలు ప్రేక్షకులను సినిమా నుండి దూరం చేయలేరు అన్నవిషయం స్పష్టంగా రుజువైంది. దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చే ఆదివారం డిసెంబర్ 12న భాగ్యనగరంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చాల డిఫరెంట్ గా నిర్వహించడమే కాకుండా ఈ ఫంక్షన్ కు అతిధులుగా ఏకంగా ముగ్గురుని పిలుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ బాలకృష్ణతో సన్నిహితంగా ఉండటం కొంతవరకు మెగా అభిమానులలో అసహనాన్ని కల్గించింది.


ఇప్పుడు ఆలోటును సరిదిద్దుకుంటూ బన్నీ చిరంజీవి పై తనకున్న ప్రేమను భక్తిని నిరూపించుకునే విధంగా ఈ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్ అందరి వాడుగా మారడంతో డార్లింగ్ ప్రభాస్ కూడ ఈ ఈవెంట్ కు మరొక అతిధిగా వస్తూ తన గొప్ప మనసును చాటుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలు మాత్రమే కాకుండా షాహిద్ కపూర్ ను కూడ  ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ ప్రస్తుతం షాహిద్ కపూర్ తో ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో తీస్తున్నాడు.


దీనితో అరవింద్ అభ్యర్ధన పై షాహిద్ కపూర్ కూడ ఈ ఈవెంట్ కు మరొక అతిధిగా వస్తాడని అంటున్నారు. అత్యంత భారీ స్థాయిలో చేయబోతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ మూవీకి మరింత భారీ క్రేజ్ తీసుకు రావడానికి అల్లు కాంపౌండ్ పక్కా వ్యూహాలు రచిస్తోంది. ‘అఖండ’ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఈమూవీ బయ్యర్లు అత్యంత భారీ రేట్లకు ఎలాంటి ఆలోచనలు లేకుండా కొనడంతో ‘పుష్ప’ సూపర్ సక్సస్ తో ఈ సంవత్సరానికి ఘనంగా ముగింపు పలకాలని ఇండస్ట్రీ వర్గాలు ఆసిస్తున్నప్పటికీ పరిస్థితుల పై ఆధారపడి ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: