ఇటీవల సర్కారు వారి పాట సినిమాకు ప్రేక్షకులలో మంచి స్పందన వచ్చినా కూడా ఎక్కువ శాతం నెగటివ్ మార్కులే పడ్డాయి. మహేష్ బాబు మేకోవర్, నటన పరంగా వందశాతం ప్రేక్షకులను అలరించాడు కానీ కథా కథనాల పరంగా దర్శకుడు పరశురాం ఏమాత్రం ప్రేక్షకులను ఆనందింపలేకపోయాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో కి ఈ సినిమా తగినది కాదని వారు చెబుతున్నారు. ఏదేమైనా మహేష్ ఈ సినిమాను ఎంపిక చేసుకొని తప్పు చేశాడని అంటున్నారు. సరీలేరు నీకేవ్వరు తర్వాత భారీ సినిమా ఒప్పుకుని ఉంటే బాగుండేదని చెప్తున్నారు.

దర్శకుడిగా టెక్నికల్ వాల్యూస్ విషయంలో పరశురాం మంచి ప్రతిభే కనబరిచాడు. ఆయన మొదటి సినిమా నుంచి అలరిస్తూ తన దర్శకత్వ ప్రతిభ తో దూసుకుపోయాడు . కానీ కథ కథనాల పరంగానే ఆయన కొన్ని సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు. ఆ విధంగానే సర్కారు వారి పాట విషయంలో కథా కథనాలు విషయంలో ఇంకాస్త పనిచేసే ఉంటే బాగుండేది అని మహేష్ అభిమానులు చెప్పారు. దాంతో పరశురామ్ కు ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది అని కూడా చెబుతున్నారు. 

మరి మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన హిట్ దక్కించుకోలేకపోయినా పరశురాం ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటిదాకా ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను అక్కినేని నాగచైతన్యతో చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్ తో ఆయనకు దూరంగా ఉంటున్నాడట. నాగచైతన్య ప్రస్తుతం చైతు ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన నాగచైతన్య కొత్త సినిమాను త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. వెంకట్ ప్రభు ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. అలా ఓ సంవత్సరం పాటు ఖాళీగా ఉండని నాగచైతన్య ఈ దర్శకుడు తో సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఆయనతో సినిమా చేసే హీరో ఎవరో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: