ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడు సినిమా విడుదల అవుతుందా ... ఎప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఒకటి.  రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు.  

రవితేజ ఈ మూవీ లో సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.  రవితేజ సరసన ఈ మూవీ లో రాజేషి విజయన్ మరియు దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ కి శరత్ మండువ  దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం లోని సభ్యులు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినా నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా విచ్చేశాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో భాగంగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ దర్శకుడు శరత్ మండువ మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  

శరత్ మండువ రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో మాట్లాడుతూ ... ట్విట్టర్ లో చూసి మూవీ కి వెళ్లడం మానేస్తే మనందరం కూడా బాగుపడతాము.  అలాగే థియేటర్ లు కూడా బాగుపడతాయి అంటూ కామెంట్లు చేశాడు.  ప్రస్తుతం ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాతో శరత్ మండువ దర్శకుడిగా ఏ రేంజ్ గుర్తింపును  అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: