దేవిశ్రీప్రసాద్ సంగీతం అంటే టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఎంతగా ఇష్టమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒకప్పుడు ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ డిమాండ్ ఉండేది. ఒక సినిమాలోని ప్రతి ఒక్క పాటను కూడా ఎంతో బాగుండేలా చూసుకుంటూ అగ్ర సంగీత దర్శకుడుగా కొన్ని సంవత్సరాలు నిలిచాడు. ఇతర భాషలలో సైతం దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రేక్షకులను అలరించాడు. పెద్ద హీరోలు అందరూ కూడా ఆయనతో సంగీతం చేయించుకోవాలని చూసేవారే కానీ గత కొన్ని రోజులుగా దేవిశ్రీప్రసాద్ పాటలకు ఎవరు కూడా ఆలరింపడకపోవడం ఆయనను కాస్త వెనక్కి నెట్టింది.

ఇదే సమయంలో మంచి సంగీతంతో గొప్ప గొప్ప పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన తమ నెంబర్ వన్ స్థానంలోకి దూసుకుపోగా దేవి శ్రీ ప్రసాద్ కొంత వెనక్కి తగ్గినట్లు అయ్యింది. ఆయన పాటలకు జాతీయస్థాయిలో అవార్డు రావడంతో ఒక్కసారిగా దేవిశ్రీప్రసాద్ పై ప్రెషర్ పెరిగిపోయిందని చెప్పాలి. ఎంత మంచి సంగీతం అందించినా కూడా దేవికి టైం కలిసి రావట్లేదు. అల వైకుంఠపురం లోని ప్రతి ఒక్క పాట కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రేక్షకులందరూ కూడా రిపీటెడ్ గా ఈ పాటలను వినడం విశేషం. యూట్యూబ్లో రికార్డులను మీద రికార్డులను కొల్లగొట్టిన పాటలకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం నిజంగా తెలుగు వారికి గర్వకారణం అనే చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కూడా సరైన గుర్తింపు రాలేదు అన్నది మాత్రం వాస్తవం. సంగీత పరంగా మంచి రికార్డులు సాధించినప్పటికీ క్రేజ్ పరంగా రేంజ్ లో ఆయన మంచి డిమాండ్ అందుకోలేకపోతున్నాడు అందుకే ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమాలతో అయినా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఏదేమైనా గతం లోలా గొప్ప కీర్తి ప్రఖ్యాతలను మాత్రం ఆయన అందుకోలేకపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: