టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా తెగ విమర్శలకు గురయ్యాడు. ఒకవైపు కృష్ణంరాజు గారు మృతి చెంది తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం తీవ్ర దుఃఖంలో మునిగి ఉంటే మరోవైపు తనకు సైమా అవార్డు వచ్చిందోచ్ అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు బుద్ధి ఉందా అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఆయనను బూతులు తిడుతూ అందరు హీరోల అభిమానులతో పాటు సాధారణ నెటిజన్స్ కూడా తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్ లెజెండ్ కృష్ణంరాజు చనిపోయిన విషయంపై ఎలాంటి పట్టింపు లేదు కానీ తనకు వచ్చిన పుష్ప సైమా అవార్డు విషయంలో ఎందుకంత ఆత్రుత, ఆనందం అంటూ కొందరు అల్లు అర్జున్ ని ప్రశ్నించారు. ఆ ట్రోల్స్ కారణమో మరేమో కానీ అల్లు అర్జున్ బెంగుళూరు నుంచి నేరుగా కృష్ణంరాజు ఇంటికి చేరుకొని కృష్ణంరాజు పార్ధివ దేహానికి నివాళులు అర్పించి, అక్కడే ఉన్న ప్రభాస్ ని పలకరించాడు.


ఆ సమయంలో ప్రభాస్ తో నవ్వుకుంట మాట్లాడడం వల్ల కూడా తిట్లు పడుతున్నాడు అల్లు అర్జున్. ప్రభాస్ ఒకవైపు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చాలా బాధతో ఉంటే అల్లు అర్జున్ నవ్వినట్లుగా ఉండడంతో సోషల్ మీడియాలో మళ్లీ అల్లు అర్జున్ ని ఒక స్థాయిలో తిట్టారు. కేవలం ప్రభాస్ ని పరామర్శించిన సమయంలోనే కాకుండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ నవ్వడం అందరికీ కాస్త ఇబ్బందిగానే అనిపించింది. ఈ సమయంలో నవ్వడం ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.ఈ విషయంలో అల్లు అర్జున్ అలా చెయ్యడం అస్సలు సరికాదు అనేది చాలామంది అభిప్రాయం. ఏ చోటుకి వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరించాలి.. ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అల్లు అర్జున్ ఆ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలంటూ నెటిజన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి నిన్న అంతా కూడా అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఒక స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలతో అయినా ఇక నుండి ఆయన తన తీరు మార్చుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: