టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.అయితే కొన్నాళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ సమయంలో ఒక టీవీ యాంకర్ తో గొడవ పెట్టుకుని ఒక్కసారిగా వివాదాల్లోకి వచ్చిన ఆయన ఇటీవల అర్జున్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా విషయంలో కూడా ఒక వివాదంలో చిక్కుకున్నారు.ఇక ఆ సినిమా నుంచి ముందు విశ్వక్ సేన్ ముందుగా తప్పుకున్నట్టు వార్తలు తెరమీదకు వచ్చాయి.  అయితే తర్వాత అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి అసలు జరిగిన విషయం ఏంటో చెప్పి

 విశ్వక్సేన్ బాధ్యత రాహిత్యం వల్ల సినిమా ఆపివేస్తున్నానని సినిమా నుంచి ఆయన తొలగిస్తున్నానని పేర్కొన్నారు. వేరే హీరోతో ఈ సినిమా పూర్తి చేస్తానని ప్రకటించారు.ఇక  ఆ తర్వాత దాస్ కా ధంకీ అనే సినిమాలో ప్రస్తుతానికి విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చెయ్యడం ఆ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పలు కామెంట్లు చేయడం వాటికి విశ్వక్సేన్ రెచ్చిపోవడం ఇలా హాట్ హాట్ గా కొన్ని రోజుల నుంచి విశ్వక్సేన అయితే వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నాడు.ఇక  ఇప్పుడు విశ్వక్సేన్ కి సంబంధించిన

 ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది.అయితే  అదేంటంటే విశ్వక్సేన్ మరో సినిమా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.ఇకపోతే న్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద పలాస దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.ఇకపోతే పలాస సినిమాతో ఒక్కసారిగా లైన్ లోకి వచ్చిన కరుణ కుమార్ ఆ తర్వాత కళాపురం అనే ఒక సినిమా చేశారు.8కె  ఆ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ దగ్గించుకుంది అయితే తారాగణమంతా చిన్నవారే కావడంతో ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు.అయితే  ఆయన తాజాగా ఒక కథ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు సినిమా చేసేందుకు సిద్ధం చేశారు.ఇక  ఈ సినిమాను విశ్వక్ సేన్ తో చేయించాలని వారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: