మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియరా అద్వానీ కాంబినేషన్ లో ఇది వరకే వినయ విధేయ రామ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి విvవి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో వినయ విధేయ రామ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ సినిమా లో రామ్ చరణ్ మరియు కియరా అద్వానీ జంటకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. 

దానితో ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ సారసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ ఉండగా , ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ మరియు కియరా అద్వానీ బర్గర్ తింటున్న ఫోటో ఒకటి నేటింట వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా అప్డేట్ ల కోసం ప్రేక్షకులు ఎంతో గాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: