మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమా షూటింగ్ మొదలు పెడదామనుకునే లోపే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో ఆయన మరింత దుఃఖంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించడంతో ఆయన ఈ బాధ నుంచి తేరుకోలేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో సినిమా వాయిదా పడుతూనే వచ్చింది.


అయితే ఇదంతా జరగక ముందు కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిన మహేష్ బాబు ఆస్తులను కొనుగోలు చేయడానికి అమెరికా వెళ్లారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో త్రివిక్రమ్ తో చేయాల్సిన ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. ఇప్పుడు ఆ బాధ నుంచి తేరుకొని మహేష్ బాబు సినిమా షూటింగ్లో పాల్గొంటారు.. డిసెంబర్ 8 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.. కానీ అది కూడా జరగలేదు . ఆయన ఏఎన్ అనే రెస్టారెంట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ పనుల్లో బిజీగా ఉండడంతో ఇక్కడ సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోయారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ -  మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా పూర్తిగా యాక్షన్ చిత్రం కాదు అని.. బ్లాక్ బాస్టర్ ఎంటర్టైనర్ చిత్రం అవుతుంది అని జనవరి 2023 నుండి సినిమా పూర్తిస్థాయిలో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. కనీసం అప్పుడైనా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందా?  ఒకవేళ పూర్తి చేసుకొని ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా త్రివిక్రమ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: