టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంకా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న సినిమా 18 పేజిస్.ఇక వరుస హిట్ చిత్రాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ ఇంకా సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ శిష్యుడు కుమారి 21 ఎఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఇంకా అలాగే పోస్టర్స్ చిత్రం పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక తాజాగా  ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.లవ్.. రొమాంటిక్.. యాక్షన్ ఇంకా మంచి థ్రిల్లింగ్ అంశాలతోల ట్రైలర్ కొనసాగింది. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా ఈ చిత్రంలోని ఆసక్తికరమైన సంఘటనలను కూడా చూపించారు. ప్రేమించడానికి రీజన్ అనేది ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నామంటే దానికి ఆన్సర్ ఉండకూడదు వంటి డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. 


ఇంకా ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతంని అందిస్తున్నారు.ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా ఈనెల 23న రిలీజ్ చేయనున్నారు.ఇంకా ఈ సందర్భంగా.. ఈ సినిమా హీరో నిఖిల్ మాట్లాడుతూ…నా కార్తికేయ సినిమాకి మంచి ప్రోమోషన్ చేశారు.అలానే ఈ చిత్రానికి మీ సపోర్ట్ కావాలి. నాపై మంచి ప్రేమను చూపిస్తున్నారు మీకు థాంక్యూ.ఈ చిత్రం కూడా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో సరయు మంచి పాత్రను చేసింది.ఇప్పటి దాకా మీరు చూసిన సరయు వేరు,ఈ మూవీలో మీరు చూడబోయే సరయు వేరు.ఈ మూవీని చూసి మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానా అని మీకు ఖచ్చితంగా 23 వ తేదీన అర్థం అవుతుంది. అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: