‘వాల్తేర్ వీరయ్య’ సంక్రాంతి విజేతగా మారడంతో మెగా అభిమానులతో పాటు చిరంజీవి కూడ మంచి జోష్ లో ఉన్నాడు. ఈవారం విడుదలయ్యే సినిమాలు లేకపోవడంతో వీరయ్య హవా ఈవారం కూడ స్పష్టంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో ఈమూవీ బయ్యర్లు మంచి లాభాల బాట పట్టనున్నారు అన్నసంకేతాలు వస్తున్నాయి.


ఈమూవీ సక్సస్ తో స్పీడ్ మీద ఉన్న చిరంజీవి తన తదుపరి సినిమా ‘భోళా శంకర్’ పై దృష్టి పెట్టి ఈమూవీ దర్శకుడు మెహర్ రమేష్ కు కొన్ని సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తున్న ఈమూవీలో తమన్నా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చేవారం నుండి ఈమూవీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఈసంవత్సరం సమ్మర్ రేస్ లో కానీ కుదరకపోతే ఈసంవత్సరం దసరా కు విడుదలచేయాలని నిర్ణయంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి ఒక కీలక సూచన చేసాడు అని టాక్.’వాల్తేర్ వీరయ్య’ ఘనవిజయంలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘బాస్ పార్టీ’ సాంగ్ అదేవిధంగా ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ మాస్ ప్రేక్షకులకు అదేవిధంగా యూత్ కు విపరీతంగా నచ్చడంతో ఆమూవీ సూపర్ సక్సస్ లో ఈరెండు పాటలు కీలకపాత్ర పోషించాయని కామెంట్స్ వచ్చాయి.


ఇప్పుడు ఈవిషయాలు అన్నీ చిరంజీవి దృష్టివరకు రావడంతో ‘భోళా శంకర్’ మూవీలో కూడ పాటలు కలర్ ఫుల్ గా ఉండే విధంగా చూడమని ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ మూవీ కథ సిష్టర్ సెంటిమెంట్ తో కూడుకుని ఉండటంతో సెంటిమెంట్ మరీ ఎక్కువైపోతే మాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ మూవీ కథలో ఎంటర్ టైన్ మెంట్ కు ఎక్కువ స్కోప్ కల్పించమని ఈమూవీ దర్శకుడుకి చిరంజీవి సలహాఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: