త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు త్రిబుల్ ఆర్ చేస్తున్న సమయంలోనే అటు తమిళ సెన్సేషన్ దర్శకుడు అయిన శంకర్ తో ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అటు కియారా అద్వానీ రాంచరణ్ కు జోడిగా నటిస్తూ ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు అటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి.



 కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రేమ్ రక్షిత్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్లు ఇక నృత్యాలను సమకూర్చారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్టర్, స్టార్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవాసినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాట కోసం ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా పనిచేయబోతున్నాడట. దీంతో ఇక ఈ పాటలో డాన్స్ ఎలా ఉండబోతుందో అనే దానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 ఇకపోతే ప్రస్తుతం ఒకే సమయంలో శంకర్ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ ను శరవేగంగా ముందుకు నడిపిస్తూనే... మరోవైపు చరణ్ సినిమా షూటింగ్ ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఏదైనా వస్తుందేమో అని అటు అభిమానులు అందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: