డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది నటి గాయత్రి గుప్తా.. ఇందులో సాయి పల్లవి స్నేహితురాలిగా నటించిన ఈమె ఆ తర్వాత కొబ్బరిమట్ట, ఐస్ క్రీమ్ వంటి చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలలో నటించింది. పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన గాయత్రి సినిమాలలో హీరోయిన్గా మాత్రం నటించలేకపోయింది. అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కూడా నటించింది.. ఇవే కాకుండా తెలుగులో బుర్రకథ, దుబాయ్ రిటర్న్స్, జంధ్యాల రాసిన ప్రేమ కథ తదితర చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన సినీ ప్రయాణం గురించి వ్యక్తిగత విషయాలను షేర్ చేయడం జరిగింది.. ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉందని రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారంటూ తెలిపింది.. తన ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించుకుంటున్నానని అలాగే తన తండ్రిని ఎప్పుడూ కూడా తండ్రిక భావించలేదంటూ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం గాయత్రి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన ఆరోగ్య సమస్య ఏంటన్న విషయం పైన మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.


అలాగే గతంలో తన ప్రియుడు తనని మోసం చేశాడంటూ కూడా పలు రకాల ఆరోపణలు చేసింది గాయత్రి.. గాయత్రి  సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇమే వెబ్ సిరీస్లలో నటిస్తోంది. దయ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్త్రిమ్మింగ్ అవుతున్నట్లు సమాచారం. ఇది కూడా బాగానే ఆకట్టుకోవడంతో ఈమె పేరు మంచి పాపులారిటీ అవుతోంది. పలు రకాల చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది గాయత్రి గుప్తా. మరి రాబోయే రోజుల్లో తనకు వచ్చిన ఆరోగ్య సమస్య గురించి తెలియజేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: