బాలీవుడ్ స్టార్స్
ఆలియా భట్,
రణబీర్ కపూర్ జంటగా ప్రముఖ
నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన రాఖీ ఔర్
రాణి కి
ప్రేమ్ కహాని
సినిమా ఇటీవల థియేటర్స్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. భారీ కలెక్షన్స్ ని సైతం అందుకుంటూ దూసుకుపోతోంది.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. కానీ సినిమాలో రణవీర్, ఆలియా కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో టాక్ తో ఎటువంటి సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా మాత్రం సూపర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో ఈ చిత్రానికి సుమారు రూ 200కోట్లకు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గ్యాప్ తర్వాత నిర్మాత కరణ్ జోహార్ దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. దర్శకుడిగా కరణ్ జోహార్ తెరకెక్కించిన చివరి చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్' 2016 లో విడుదలైంది. మళ్లీ ఏడేళ్ల గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ దర్శకుడు. ఇక తాజాగా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఆమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా సెప్టెంబర్ 9న ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తెచ్చారు. రూ.349 రూపాయలు చెల్లించి ఈ సినిమాని చూడాలని ప్రైమ్ వీడియో కండిషన్ పెట్టింది. కానీ ఇప్పుడు ఫ్రీగా ప్రైమ్ మీడియాలో కేవలం హిందీ భాషలో మాత్రమే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలోని కొన్ని డిలీటెడ్ సీన్స్ ని జోడించి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' మూవీ రన్ టైం పది నిమిషాలు పెరిగినట్లు తెలుస్తోంది.