సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న సెలబ్రిటీస్ లో స్టార్ హీరోయిన్ సమంత ముందు వరుసలో ఉంటుంది అని చెప్పాలి. సౌత్ లోనే కాకుండా నార్త్ లో సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సమంతా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లు అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. సమంతను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 30 మిలియన్లకు చేరుకుంది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో వెల్లడిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ అన్నిచోట్ల మంచి పాపులారిటీ దక్కించుకున్న సమంత.. నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది. 

నిత్యం తన ఫోటోలు, వీడియోలను రెగ్యులర్గా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. దానికి తోడు వరుస సినిమాలు చేస్తూ వాటి అప్డేట్స్ తో అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ లో 30 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని అరుదైన ఘనత సాధించింది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత ఓ బిల్డింగ్ దగ్గర కూర్చొని స్మైల్ ఇస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.." 30 మిలియన్ అని రాసి 4 హార్ట్ ఎమోజీలని జత చేసింది". ఈ ఫోటోలో సమంత ఆఫ్ వైట్ ప్రింటెడ్ ఓవర్ సైజ్ స్వేట్ షర్ట్, బ్రౌన్ ప్యాంట్, తలకి నీలి రంగు టోపి ధరించి ఎంతో అందగా కనిపించింది. 

ప్రస్తుతం సమంతా షేర్ చేసిన ఈ ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. సామ్ 30 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది సమంత. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాలో విజయ్, సమంతల కెమిస్ట్రీ, సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక 'ఖుషి' తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది సామ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: