టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత నాగవంశీకి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. నెలరోజుల్లో నాగవంశీ నుంచి ఏకంగా మూడు సినిమాలు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు హిట్టయితే మాత్రం నాగవంశీకి తిరుగులేనట్టే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 31వ తేదీన నాగవంశీ నిర్మించిన కింగ్ డం మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కగా  త్వరలో  ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.  ఈ  సినిమా హిందీలో అయితే విడుదల కావడం లేదు.  సౌత్ భాషల్లో మాత్రమే రిలీజ్ కానున్న ఈ సినిమా  ఏ స్థాయిలో సంచలనాలు  సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. కింగ్ డం  సినిమాలో ట్విస్టులు మాత్రం  ఒకింత ఆసక్తికరంగానే ఉండనున్నాయని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సినిమా తర్వాత నాగవంశీ డిస్ట్రిబ్యూట్  చేస్తున్న  వార్2 ఆగష్టు నెల 14వ తేదీన విడుదల కానుంది.  ఈ సినిమా కోసం నాగవంశీ 80 కోట్ల రూపాయల  రేంజ్ లో ఖర్చు చేశారు.  వార్2 సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే మాత్రం  ఈ సినిమా రేంజ్ మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

ఆగస్టు నెల 27వ తేదీన రవితేజ నటించిన  మాస్ జాతర మూవీ విడుదల కానుంది.  భాను భోగవరపు  డైరెక్షన్ లో  ఈ సినిమా తెరకెక్కగా  అటు రవితేజ  ఇటు భాను భోగవరపు  ఈ సినిమాతో సక్సెస్ సాధించాల్సి ఉంది.  నాగవంశీ  ఈ మూడు సినిమాలతో దాదాపుగా 300 కోట్ల రూపాయలు  రిస్క్ లో పెడుతున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: