బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ విద్యాబాలన్ బాగా సుపరిచితమే ఈమె ఎన్నో చిత్రాలలో ఎన్నో భాషలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. 2003లో బెంగాలీ సినిమా ద్వారా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమైన విద్యాబాలన్ 2005లో పరణిత అనే ఒక సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ది డర్టీ పిక్చర్ అనే చిత్రంతో భారీ క్రేజ్ సంపాదించుకుంది విద్యాబాలన్. అలా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి పేరు సంపాదించిన విద్యాబాలన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలియజేసింది.

స్టార్ హీరోగా పేరు పొందిన మోహన్ లాల్ తో నటించాల్సిన చక్రం సినిమా మధ్యలోనే ఆగిపోయిందని.
సినిమా వల్ల  రాత్రికి రాత్రి తన జీవితం మొత్తం ఒక్కసారిగా మారిపోయిందని వెల్లడించింది. ఆ సినిమా ఆగిపోవడంతో తనని ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని ఇది చాలా బాధను కలిగించిందని వెల్లడించింది విద్యాబాలన్. మలయాళ స్టార్ హీరో గా పేరు పొందిన మోహన్ లాల్ తో కలిసి చక్రం సినిమాలో నటించడానికి సైన్ చేశాను.. కొద్దిరోజుల పాటు ఆ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఆగిపోయిందని తెలిపింది.


అయితే సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం తానే అంటూ చాలా ప్రచారం కూడా చేశారు దీంతో తన మీద ఐరన్ లెగ్గానే ముద్ర వేశారనీ చాలా బాధపడ్డానని.. దీంతో రాత్రికి రాత్రి తాను నటించాల్సిన తొమ్మిది సౌత్ సినిమాల నుంచి తనను తొలగించడంతో ఆ ఒక్క సినిమా తన జీవితాన్నే మార్చేసింది అంటూ తెలిపింది విద్యాబాలన్.. కానీ ఆ తొమ్మిది ప్రాజెక్టులు ఆగిపోవడానికి తనకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. డైరెక్టర్లకు హీరోలకు నిర్మాతలకు మధ్య వచ్చిన మనస్పర్ధల వల్లే ఆగిపోయాయని కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం తన కెరీర్ మీద చాలా చూపించింది అంటే తెలిపింది. అయితే వచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకొని పేరు సంపాదించి ఎన్నో అవార్డులను  అందుకని బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: