పోయిన సంవత్సరం చిన్న సినిమాలుగా విడుదల అయిన అనేక మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా చిన్న సినిమాగా విడుదల అయ్యి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న సినిమాలలో కమిటీ కుర్రాళ్ళు మూవీ ఒకటి. ఈ సినిమాను నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించింది. ఈ సినిమాను పోయిన సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి డబల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 70 లక్షలు , మొత్తంగా ఆంధ్ర ఏరియాలో కలుపుకొని 3.02 కోట్ల కలెక్షన్లు ఈ మూవీ కి దక్కాయి. ఇక మొత్తం బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ఏపీ మరియు తెలంగాణ లో కలుపుకొని 7.22 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 30 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7.64 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ కి మొత్తం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 7.64 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే డబల్ కంటే ఎక్కువ లాభాలను అందుకొని డబల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా పోయిన సంవత్సరం చిన్న సినిమాగా విడుదల ఆయన కమిటీ కుర్రాళ్ళు మూవీ మంచి టాక్ ను తెచ్చుకొని డబల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: