టాలీవుడ్ యాక్టర్ గా పేరు సంపాదించిన ధర్మ మహేష్ అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆయన భార్య ఈ నటుడు పైన కేసు పెట్టినట్లుగా వినిపిస్తున్నాయి. గచ్చిబౌలిలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అటు మహేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా ఈ కేసు నమోదు అయినట్లుగా వినిపిస్తున్నాయి. ధర్మ మహేష్ సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాల ద్వారా బాగానే నటుడుగా పేరు సంపాదించారు. అయితే గతంలో కూడా ఈ వరకట్నం వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు మొదటిసారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట. కానీ అతనిలో మార్పు రాలేదని వేధింపులు కొనసాగిస్తూ ఉన్నారని మహేష్ భార్య ఫిర్యాదు చేసింది.



2019లో గౌతమి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ధర్మ మహేష్. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్న తర్వాత మహేష్ ఎక్కువగా జల్సాలకు అలవాటు పడ్డారని.. దీంతో అదనపు కట్నం తేవాలి అంటు తన భార్యను వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. ఈ నటుడు పైన కేసు నమోదు కావడంతో అటు వరకట్న వేధింపులే కాకుండా గృహహింసపై కూడా చర్చలు మొదలయ్యాయి.


సినీ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన యువ నటుల వ్యక్తిగత జీవితాలలో ఇవే ఎక్కువగా వినిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా వస్తున్న అవకాశాలను వినియోగించుకోకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల వచ్చే అవకాశాలు కూడా చెడగొట్టుకుంటున్నారు యువ నటీ నటులు. ధర్మ మహేష్ ను పోలీసులు సైతం విచారణ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయంపై నటుడు ధర్మ మహేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇక మీదట నైన ఇలాంటి పనులు మరే యువనటులు చేయకుండా ఉండాలని పలువురు నేటిజన్స్ సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: