
అలాగే థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్గా దాదాపు రూ.180 కోట్లకు పైగా సేల్ అయ్యాయని టాక్. మొత్తం కలిపి రూ.300 కోట్లు వసూలు చేసింది. అంటే బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తాన్ని రిలీజ్కు ముందే రికవరీ చేసేశాడు దానయ్య. దీంతో ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి – “ఆర్ఆర్ఆర్ తరహాలోనే, ఓజీతో కూడా దానయ్యకు అదృష్టం కలిసొచ్చింది” అని. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయం అంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ క్రేజ్ దానయ్యకు మళ్లీ బంగారు బాట వేసిందని చెప్పొచ్చు. మొత్తం మీద.. డీవీవీ దానయ్య లక్ మళ్లీ పునరావృతం కావడం ఖాయం అంటున్న ట్రేడ్ వర్గాలు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఓజీ కూడా బ్లాక్బస్టర్ లాభాలను తెచ్చిపెడుతుందా అన్నది చూడాలి..!