తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ సింగర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హీరోగా కొత్తగా అడుగులు వేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఆ చిత్రమే ఎల్లమ్మ. ఈ చిత్రాన్ని బలగం ఫెమ్ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో రాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ దర్శకులు కూడా ఆయనకు కథలు వినిపించిన కేవలం సంగీతం పైన మాత్రమే దృష్టి పెట్టారు.


అయితే ఈసారి మాత్రం ఎల్లమ్మ కథ వినగానే తనకు బాగా నచ్చడంతో చివరికి హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరో నాని, ధనుష్, నితిన్ వంటి వారి పేర్లు పరిశీలనలో వినిపించాయి. కానీ ఇప్పుడు చివరికి ఏకంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఫైనల్ గా నటించబోతున్నారని వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఒక సోషియల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నది.


 ఇలాంటి తరుణంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరొక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే దేవిశ్రీప్రసాద్ కి జోడిగా ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఎంపిక చేయబోతున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజ్ బ్యానర్ పై కీర్తి సురేష్ , విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటించబోతోంది ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్టులో కూడా ఈమె ఎంపిక చేయాలని చూస్తున్నట్లు వినిపిస్తోంది. అని అనుకున్నట్టు కుదిరితే దేవిశ్రీప్రసాద్, కీర్తి జోడిని తెర పైన చూడవచ్చు. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి తరుణంలో ఇలాంటి రిస్కులు అవసరమా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: