ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపాసన రెండోసారి గర్భవతి అయ్యిందనే వార్తే చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా నుంచి సినీ ఇండస్ట్రీ వరకు — ఎవరిని అడిగినా “వావ్..! ఎంత మంచి వార్త ఇది..! ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిందంట..! ఈసారి కావలలకు జన్మనివ్వబోతోందట..!” అంటూ ఆనందంతో మాట్లాడుతున్నారు. మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడూ ఫ్యాన్స్‌కే కాదు, మొత్తం టాలీవుడ్‌కే ఒక ఫెస్టివల్‌లాంటి హంగామా ఉంటుంది. అలాంటి కుటుంబంలో మరోసారి సంతోష వాతావరణం నెలకొంది. ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు, బంధువులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీలు అందరూ ఒక్కటే మాట చెబుతున్నారు – “ఇది డబుల్ ధమాకా దివాళి..!”అయితే, ఈ ఆనంద వార్త బయటకు వచ్చేముందు రెండు రోజుల కిందటే మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని దివాళి సెలబ్రేషన్ ఫోటోలు షేర్ చేశారు.

ఆ ఫోటోల్లో వెంకటేష్, నాగార్జున, నయనతార వంటి స్టార్ హీరోలు కూడా కనిపించారు. ఆ ఫోటోల్లో చిరంజీవి,  ఎక్కడా ఉపాసన ప్రెగ్నెన్సీ గురించిన చిన్న హింట్‌ కూడా ఇవ్వలేదు. ఇదే విషయం ఇప్పుడు అభిమానుల్లో, సోషల్ మీడియా వేదికల్లో పెద్ద చర్చగా మారింది. జనాలు ప్రశ్నిస్తున్నారు — “చిరంజీవి గారు ఎందుకు ఈ విషయం ముందుగా షేర్ చేయలేదు? కనీసం చిన్న హింట్అయినా ఇవ్వొచ్చుగా..!” అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.“ఉపాసన ఈ వార్తను ప్రైవేట్‌గా ఉంచాలని, ఫ్యామిలీతో మాత్రమే పంచుకోవాలని కోరుకుందేమో. అందుకే చిరంజీవి గారు గానీ, రామచరణ్ గానీ ఈ విషయం బయటపెట్టలేదు,” అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు — ఈసారి దివాళి మెగా ఫ్యామిలీకి ఎంతో అదృష్టం తెచ్చింది. ఒక వైపు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా, మరో వైపు కుటుంబంలోకి మరో కొత్త జీవితానికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు.

ఉపాసన ఈ సంతోష వార్తను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా చాలా హృదయాన్ని తాకేలా ఉంది. ఆమె షేర్ చేసిన వీడియో చూస్తే ఎవరికైనా సర్ప్రైజ్ ఫీలింగ్ వస్తుంది. ఆ వీడియోలో ఉపాసన ముఖంపై కనిపించిన సంతోషం, ఆమె కళ్ళల్లో మెరిసిన మమకారం, రామ్ చరణ్ చూపిన ఆనందం – ఇవన్నీ చూస్తే కుటుంబంలో ఎంత బంధం, ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: