తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి వారసులు మెగాస్టార్ చిరంజీవి , అయన తనయుడు రామ్ చరణ్ లు తమకు అన్యాయం చేశారని  జూబ్లీ హిల్స్  పోలీసులను ఆశ్రయించారు . ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో కొణిదెల పతాకం పై రామ్ చరణ్, సైరా నర్సింహా రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే . ఈ  సినిమా ప్రారంభించేటప్పుడు నర్సింహా రెడ్డి వారసులకు ఆర్థికంగా చేయూతనందించడమే కాకుండా , వారిని ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి వారసులుగా ప్రపంచానికి పరిచయం చేస్తానని రామ్ చరణ్ హామీ ఇచ్చినట్లు వారు  చెప్పుకొచ్చారు .


అయితే ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి కి 11 మంది వారసులు ఉండగా వారిని కాదని రాజకీయ కారణాల తో మరొకర్ని నర్సింహా రెడ్డి వారసునిగా పరిచయం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు . అంతేకాకుండా , ఆర్ధికంగా చేయూతను ఇవ్వకుండా రామ్ చరణ్ మోసం చేశారని నర్సింహారెడ్డి వారసుడు దస్తగిరి వాపోయారు . ఇదే విషయమై చిరంజీవి ని అడగడానికి వెళ్లిన తమ వారిపై కేసులు నమోదు చేశారని అన్నారు . కొణిదెల ప్రొడక్షన్స్ తమకు చేస్తున్న అన్యానికి నిరసనగా వారిపై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు .


చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందించిన సైరా సినిమా  టీజర్ ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్  చేయగా అనూహ్య స్పందన లభిస్తోంది . విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక , నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్న  తరుణం లో... ఉయ్యాలవాడ  నర్సింహా రెడ్డి వారసులు తమకు కొణిదెల ప్రొడక్షన్స్ , నిర్మాత రాంచరణ్ , హీరో చిరంజీవి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో మరి ..


మరింత సమాచారం తెలుసుకోండి: