ఎంతో మంది భారతీయులు ఉన్నత ఉద్యోగాల కోసమో, లేదా జీతాలు ఎక్కువ వస్తున్నాయనే ఆశతో తన భవిష్యత్ అవసరాల కోసం దేశం కాని దేశం వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అరబ్ దేశాలకు మన భారత్ నుంచీ వలసలు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అక్కడికి వెళ్ళే వారిలో చాలా మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళే. వాళ్ళు అక్కడ సంపాదించే డబ్బును భారత్ లో ఉన్న కుటుంభ సభ్యులకు పంపుతారు. అయితే ఒక వేళ అనుకోని విధంగా పొట్ట కూటికోసం వెళ్ళిన ఎన్నారై చనిపోతే ఆ కుటుంభం ఆర్ధిక సంక్షోభంలో కొట్టుకుపోవాల్సిందే.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఖతర్  లోని భారత ఎంబసీ, ప్రవాసీ భిమాను తెలుగు ఎన్నారైల కోసం ఏర్పాటు చేసింది. ఖతర్ లో తెలుగు కార్మికుల కోసం ఏర్పాటు చేయబడిన ఐసిబీఎఫ్ భారత ఎంబసీ కలిసి ఈ ప్రవాసి భీమాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో ఈ పధకం కిందకు  రెండు తెలుగు రాష్ట్రాలాలో ఉన్న తెలుగు ఎన్నారైలు అందరూ అర్హులేనని ఐసిబీఎఫ్ ప్రకటనలో తెలిపింది. ప్రతీ ఒక్క ఎన్నారై తప్పకుండా భీమా లో చేరాలని  సూచిస్తున్నారు. ఖతర్ లోని కొన్ని తెలుగు సంఘాలు సైతం ఈ భీమా పై అవగాహన కల్పిస్తున్నాయి.
ఇంతకీ ఎ భీమా ఎన్నారై లకు ఎలా ఉపయోగపడుతుంది

ఈ భీమా తీసుకున్న వ్యక్తి  అనుకోని విధంగా మృతి చెందితే ( గడుపు ముగిసే లోగా) చనిపోయిన వారి కుటుంభానికి  దాదాపు రూ. 20 లక్షలు ఇస్తారని పేర్కొన్నారు.సుమారు రెండేళ్ళు వ్యవధి కలిగిన ఈ పాలసీ కోసం ఎన్నారై కట్టాల్సింది 125 రియాళ్ళు . ఈ పాలసీ తీసుకున్న తరువాత పాలసీ దారుడు ఎవరైనా గాయపడితే ఈ సమయంలో వైకల్యం కలిగితే సదరు పాలసీ దారుడికి ఆక్కడి ఆసుపత్రి నివేదికలు బట్టి నష్టపరిహారం చెల్లిస్తారు. ఒక వేళ ఈ పాలసీ దారుడు పాలసీ సమయంలో భారత్ వెళ్లి అక్కడ మృతి చెందినా, వైకల్యం కలిగినా డబ్బులు అప్పగిస్తారు. ఈ ప్రవాసి పాలసీ గురించి మరిని విషయాలు తెలుసుకోవాలని అనుకునే వారు కింద్ర తెలిపిన ఫోన్ నెంబర్ లను సంప్రదించవచ్చు.  సెల్   - 0097477867794

మరింత సమాచారం తెలుసుకోండి: