ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఖతర్ లోని భారత ఎంబసీ, ప్రవాసీ భిమాను తెలుగు ఎన్నారైల కోసం ఏర్పాటు చేసింది. ఖతర్ లో తెలుగు కార్మికుల కోసం ఏర్పాటు చేయబడిన ఐసిబీఎఫ్ భారత ఎంబసీ కలిసి ఈ ప్రవాసి భీమాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో ఈ పధకం కిందకు రెండు తెలుగు రాష్ట్రాలాలో ఉన్న తెలుగు ఎన్నారైలు అందరూ అర్హులేనని ఐసిబీఎఫ్ ప్రకటనలో తెలిపింది. ప్రతీ ఒక్క ఎన్నారై తప్పకుండా భీమా లో చేరాలని సూచిస్తున్నారు. ఖతర్ లోని కొన్ని తెలుగు సంఘాలు సైతం ఈ భీమా పై అవగాహన కల్పిస్తున్నాయి.
ఇంతకీ ఎ భీమా ఎన్నారై లకు ఎలా ఉపయోగపడుతుంది
ఈ భీమా తీసుకున్న వ్యక్తి అనుకోని విధంగా మృతి చెందితే ( గడుపు ముగిసే లోగా) చనిపోయిన వారి కుటుంభానికి దాదాపు రూ. 20 లక్షలు ఇస్తారని పేర్కొన్నారు.సుమారు రెండేళ్ళు వ్యవధి కలిగిన ఈ పాలసీ కోసం ఎన్నారై కట్టాల్సింది 125 రియాళ్ళు . ఈ పాలసీ తీసుకున్న తరువాత పాలసీ దారుడు ఎవరైనా గాయపడితే ఈ సమయంలో వైకల్యం కలిగితే సదరు పాలసీ దారుడికి ఆక్కడి ఆసుపత్రి నివేదికలు బట్టి నష్టపరిహారం చెల్లిస్తారు. ఒక వేళ ఈ పాలసీ దారుడు పాలసీ సమయంలో భారత్ వెళ్లి అక్కడ మృతి చెందినా, వైకల్యం కలిగినా డబ్బులు అప్పగిస్తారు. ఈ ప్రవాసి పాలసీ గురించి మరిని విషయాలు తెలుసుకోవాలని అనుకునే వారు కింద్ర తెలిపిన ఫోన్ నెంబర్ లను సంప్రదించవచ్చు. సెల్ - 0097477867794