అల్లారుముద్దుగా.. పెంచుకున్న ఒక్కొగానొక్క కూతురిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు ఆ తండ్రి. ఎంతో గారాబంగా పెంచిన కూతురిని పెళ్లీడుకొచ్చాక ఓ మంచి కుర్రాడిని వెతికి, ఘనంగా పెళ్లి చేశారు ఆ పుణ్య దంపతులు. కూతురు, అల్లుడు సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నారు. అయితే.. పెళ్లి తర్వాత కూతరు తప్పుడు దార్లు తొక్కింది. భర్తతో ప్రేమగా ఉండాల్సింది పోయి.. మరో వ్యక్తితో ప్రేమ నెరిపి.. ఆఖరకు అక్రమ సంబంధం పెట్టుకుంది. 

 

దానితో అవమానాన్ని భరించలేని ఆ తండ్రి తట్టుకోలేకపోయి, ఎంతో ప్రేమగా పెంచిన తన కూతురిని దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన  కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి తాలుకా గోడేహళ్ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి వ్యసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కి ఒక్కొక్కగానొక్క కుమార్తె కవిత(22). చాలా ప్రేమగా పెంచాడు. గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో చాలా ఘనంగా.. పెళ్లి చేశారు.

 

అయితే కవితకు ఆ ప్రాంతంలోనే వున్న ప్రకాశ్‌ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల నుంచి భర్తను వదలి ప్రియునితో సహజీవనం చేస్తోంది. కవిత భర్త.. భార్య కనిపించడం లేదని తోరణగల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కవిత పుట్టింటికి వచ్చింది. ప్రియుడు కూడా వచ్చి కవితను తనతో రావాలని గొడవకు దిగడం జరిగింది. ఈ సంఘటనతో తండ్రి గోపాలరెడ్డి ఎంతో మథన చెంది,  సోమవారం రాత్రి కూతురితో ఆయన ఘర్షణ పడ్డాడు. కడకు అవమాన్ని భరించలేని ఆ తండ్రి కన్న కూతురిని కడతేర్చాడు. 

 

ఈ గొడవలో ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. ఇరుగు పొరుగు వున్నవారు మాత్రం తప్పుడు పని చేసిన ఆ తప్పుడు మనిషిని కడతేర్చిన ఆ తండ్రిని సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆయన్ని అరెస్ట్ చేసారు. ఏది ఏమైనా సభ్య సమాజం తల దించుకునే సంఘటనలు జరగడం ఇది కొత్తేమీకాదు... ఇటీవల మరి ఎక్కువైపోనాయి. క్షణిక సుఖం కోసం... నూరేళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: