సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నోరు విప్పారా ?, నిజంగానే ఆయన నోరు విప్పితే ఎవరి   పేర్లు వెల్లడించారన్నది హాట్ టాఫిక్ గా మారింది . రస్ అల్ ఖైమా సొమ్మును తాను ఎవరికి ఇచ్చింది, నిమ్మగడ్డ సెర్బియా పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది . దీనితో  తెలుగు సినీ పరిశ్రమ కు చెందిన, జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే  ఇద్దరు అగ్ర హీరోల పేర్లను బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది . ఆ ఇద్దరు అగ్ర హీరోల తో కలిసి  గతం లో ఆయన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన   విషయం తెల్సిందే .

 

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం వాడివేడిగా కొనసాగుతున్నాయి . జగన్ సర్కార్ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ ని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుంటే, టీడీపీ నాయకత్వం ... జగన్, ఆయన  సన్నిహితులపై ఉన్న ఆర్ధిక నేరాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే ప్రయత్నాల్లో నిమగ్నమైంది . ఇక నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకోగానే , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి ఆయన్ని విడిపించే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపించింది .నిమ్మగడ్డ, రస్ అల్ ఖైమా కు ముఖ్యమంత్రి  జగన్ పేరును చెప్పినందుకే ఆయన విదేశాలకు వెళ్లడం లేదని టీడీపీ ఆరోపిస్తున్న నేపధ్యం లో తాజాగా సినీ హీరోల పేర్లను కూడా ఆయన వెల్లడించినట్లు ప్రచారం జరగడం వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉన్నదా ? అన్న అనుమానాలు లేకపోలేదు .

 

ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమ కు చెందిన ఓ అగ్ర హీరో , ఇటీవల జగన్ తో సన్నిహితంగా మెలగడం ... త్వరలో  ఆయన కు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న సమయం లో సెర్బియా పోలీసులకు సదరు హీరో పేరు  నిమ్మగడ్డ వెల్లడించారన్న ఊహాగానాలు విన్పించడం చూస్తే ఆ   అనుమానాలకు  బలం చేకూరినట్లయింది .  

మరింత సమాచారం తెలుసుకోండి: