రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే పార్టీలు మారతారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కడుతున్నారని తెలిపారు. దుబ్బాకలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదని జోస్యం చెప్పారు. సిద్దిపేటలో బీజేపీ నేతల వ్యాఖ్యలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయని వెల్లడించారు. మా ఓపిక నశిస్తే ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలను కిషన్ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత కేసీఆర్ కి, మా ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందని.. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్కు జై కొడుతున్నారని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే పార్టీలు మారతారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కడుతున్నారని తెలిపారు. దుబ్బాకలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదని జోస్యం చెప్పారు. సిద్దిపేటలో బీజేపీ నేతల వ్యాఖ్యలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయని వెల్లడించారు. మా ఓపిక నశిస్తే ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలను కిషన్ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత కేసీఆర్ కి, మా ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందని.. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్కు జై కొడుతున్నారని గుర్తుచేశారు.