గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉంటూ వస్తున్న అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి వెదకెక్కాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జెసి బ్రదర్స్ మధ్య చాలా కలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య కు సంబంధించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టారని, ఇది జేసీ అనుచరులే చేసారు అంటూ కేతిరెడ్డి వర్గీయులు జేసీ అనుచరులపై దాడికి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పోస్టింగ్ వ్యవహారానికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆందోళన నిర్వహించడమే కాకుండా, దాడులకు దిగారని, దీనికి నిరసనగా జేసి వర్గీయులు ఆందోళనకు దిగడం, అలాగే కేతిరెడ్డి వర్గీయులు సైతం ఆందోళన నిర్వహించడంతో  తాడిపత్రి లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.



 సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు పోలీస్ లు ఎంత ప్రయత్నించినా ఎవరు వెనక్కి తగ్గకుండా ,ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్వయంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి, ఆయన అనుచరుడైన కిరణ్ అనే వ్యక్తి పై దాడి కి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్త తెలిసిన వెంటనే హైదరాబాదులో ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి కి బయలుదేరినట్లు సమాచారం. ఈ వ్యవహారం తో వాతావరణం వేడెక్కడం తోపాటు, దాడులు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.



 ఇప్పుడు తాడిపత్రిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా ఈ వ్యవహారంపై జేసీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: